నవంబర్ 6న పాలేరులో షర్మిల నామినేషన్

నవంబర్ 6న పాలేరులో షర్మిల నామినేషన్
  • రాష్ట్రవ్యాప్తంగా 50 సభలకు ప్లాన్ 

హైదరాబాద్, వెలుగు: వైఎస్సార్‌‌‌‌టీపీ చీఫ్ షర్మిల ఈ నెల 6న పాలేరు నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆ పార్టీ వెల్లడించింది. ఇందుకు సంబంధించి నామినేషన్ ఫాంలు, అఫడవిట్‌‌లు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. అలాగే, నియోజకవర్గంలో ఆమె విసృతంగా పర్యటించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శుక్రవారం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను షర్మిల విడుదల చేయనున్నారు. శనివారం ఖమ్మం వెళ్లి అక్కడే ఉండనున్నారని, ఇందుకు ఇళ్లు అద్దెకు తీసుకున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. షర్మిలతో పాటు విజయమ్మ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. 

ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 50 సభలకు షర్మిల అటెండ్ కానున్నారు. వైఎస్సార్‌‌‌‌టీపీకి కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించిన బైనాక్యులర్ గుర్తు వద్దని, ఫ్రీ సింబల్స్‌‌లో వేరే గుర్తు కేటాయించాలని ఈసీకి పార్టీ అప్లికేషన్ పెట్టుకుంది.ఈసీ కొత్త గుర్తును కేటాయించకపోతే బైనాక్యులర్ గుర్తుతోనే ఎన్నికలకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.