కేసీఆర్ మానస పుత్రిక ధరణి తప్పుల తడక : షర్మిల

కేసీఆర్ మానస పుత్రిక ధరణి తప్పుల తడక :  షర్మిల

హైదరాబాద్, వెలుగు : కేసీఆర్ మానస పుత్రిక ధరణి తప్పుల తడకని ఆయన ఎన్నికల అఫిడవిట్ ద్వారానే తేటతెల్లం అయ్యిందని వైఎస్సార్​టీపీ చీఫ్​ షర్మిల శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం భూమి రికార్డుల కన్నా ధరణిలో ఒక గుంట ఎక్కువగా నమోదైందని చెప్పారు. ఈ లెక్కన సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ ఊరిలో చూసినా ధరణి గోసలే ఉన్నాయని, తహసీల్దార్​ఆఫీస్​ల నుంచి కోర్టుల దాకా ధరణి బాధలేనని విమర్శించారు.

రైతుల భూములు గుంజుకొని కోర్టుల చుట్టూ తిప్పుతూ ధరణే ధైర్యం అని చెప్పడానికి సిగ్గుండాలని ధ్వజమెత్తారు. ధరణి తిప్పలు తీరాలంటే దొర నియంత పాలనను బొంద పెట్టడం ఒక్కటే మార్గమన్నారు.