దళిత బంధు పేరుతో కేసీఆర్ మరో మోసం

దళిత బంధు పేరుతో కేసీఆర్ మరో మోసం

ఖమ్మం: పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో కేసీఆర్ మోసం చేయని వర్గం లేదని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఫైర్ అయ్యారు. ప్రజా ప్రస్థాన యాత్రలో భాగంగా షర్మిల మధిర నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కరెంట్, బస్సు చార్జీలు పెంచుతూ కేసీఆర్ పేదల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని  టీఆర్ఎస్ సర్కార్ నెరవేర్చలేదని ఆరోపించారు.  రుణ‌మాఫీ, డ‌బుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెక‌రాల భూమి, ముస్లింల‌కు 12శాతం రిజ‌ర్వేష‌న్లు అని చెప్పి ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగమంటూ నిరుద్యోగులను వంచించారన్నారు. ఇప్పుడు దళిత బంధు అంటూ కేసీఆర్ మరో మోసానికి తెర తీశారని షర్మిల ఆరోపించారు.