టీఆర్ఎస్ లీడర్లు తాలిబన్లలా వ్యవహరిస్తున్నారు

టీఆర్ఎస్ లీడర్లు తాలిబన్లలా వ్యవహరిస్తున్నారు

ఖమ్మం జిల్లా: సీఎం కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశారని మండిపడ్డారు YSRTP అధ్యక్షురాలు షర్మిల. టీఆర్ఎస్ లీడర్లు తాలిబన్లలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదన్నారు. ఖమ్మం జిల్లాలో ప్రజాప్రస్థాన యాత్ర కొనసాగిస్తున్నారు షర్మిల.  వైరా టౌన్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె పాల్గొన్నారు.  

సీఎం కేసీఆర్ తనతో ఒక్కరోజు పాదయాత్ర చేయాలని సవాల్ చేశారు. సమస్యలు లేకుంటే ముక్కు నేలకు రాసి ఇంటికి వెళ్లిపోతానన్నారు. సమస్యలు ఉంటే సీఎం పదవికి రాజీనామా చేసి.. దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేశారు. రైతుబీమాకు 60 ఏండ్ల వయో పరిమితి ఎందుకన్న ఆమె.. 60 ఏండ్లు దాటితే రైతు కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ మాత్రం 69 ఏండ్లలోనూ పదవులు అనుభవించవచ్చు.. రైతు మాత్రం 60 ఏండ్లు కూడా బతకొద్దా అన్నారు. 

మరిన్ని వార్తలు..

ఒక వ్యక్తి, ఒక కుటుంబం చేతిలో బందీగా తెలంగాణ

రేపు సిద్ధూ కుటుంబాన్ని పరామర్శించనున్న రాహుల్‌