కేసీఆర్ పాలనలో ప్రజల కష్టాలు

 కేసీఆర్ పాలనలో ప్రజల కష్టాలు

ఖమ్మం: కేసీఆర్ పాలనలో ప్రజలు తీవ్ర కష్టాలు పడుతున్నారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. షర్మిల చేపట్టిన ప్రజా  ప్రస్థాన యాత్ర 1200 కిలో మీటర్లు పూర్తి చేసుకుంది. 91వ రోజుకు చేరుకున్న షర్మిల యాత్ర మధిర నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా అక్కడి ప్రజలనుద్దేశించి షర్మిల మాట్లాడుతూ... కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలయిందన్నారు. రాష్ట్ర ఖజానా దివాళ తీసిందని, జీతాలకు కూడా నిధులు లేవని ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు అధికారంలోకి వచ్చిందని, అనేక సంక్షేమ కార్యక్రమాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు కల్పించారని చెప్పారు. అయితే ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా  మారిందని, రేవంత్ రెడ్డి అనే దొంగ చేతిలో రాష్ట్ర కాంగ్రెస్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. అలాంటి వ్యక్తి నాయకత్వంలో భట్టి విక్రమార్క లాంటి మంచి వ్యక్తులు ఎలా పని చేస్తున్నారని ప్రశ్నించారు. వైఎస్ఆర్ వల్లే భట్టి ఈ స్థాయిలో ఉన్నారని చెప్పారు.