టీఆర్ఎస్ ను గద్దె దించేందుకే బీజేపీలో విలీనం

టీఆర్ఎస్ ను గద్దె దించేందుకే బీజేపీలో విలీనం

బీజేపీలో యువ తెలంగాణ పార్టీని విలీనం చేశారు ఆ పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలక్రిష్ణా రెడ్డి . ఢిల్లీలోని..  కాన్స్టిట్యూషన్  క్లబ్ లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తవ్డే, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సమక్షంలో విలీనం చేశారు. యువ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రాణిరుద్రమ.. ఇతర నాయకులు పార్టీ విలీన కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన జిట్టా బాలకృష్ణారెడ్డి.. టీఆర్ఎస్ ను గద్దె దించడానికే  బీజేపీలో యువ తెలంగాణ పార్టీని  విలీనం చేశామన్నారు.  తెలంగాణలో కేసీఆర్ పాలన ఏవిధంగా ఉందో.. దేశంలో మోడీ పాలన ఎలా ఉందో అందరికీ తెలుసన్నారు. గత 15 రోజులుగా కేసీాఆర్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా యువతెలంగాణ పార్టీని బీజేపీలో విలీనం చేశామన్నారు. కేసీఆర్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. యువత  బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.

మరిన్ని వార్తల కోసం

రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భారీ బందోబస్తు

పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్