పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’. ఈ సినిమాను ఒకేసారి తెలుగుతో పాటు హిందీలోనూ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మ్యాన్లీ హీరో రానా, నిత్యా మీనన్ కూడా యాక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ఈనెల 25న ప్రేక్షకుల మధ్యకు తీసుకురానున్నట్లు మూవీ టీమ్ వెల్లడించింది. ఈ మేరకు రిలీజ్ పోస్టర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న భీమ్లా నాయక్ కు.. ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందించారు. మాతృకతో పోల్చితే ఈ సినిమాలో పవన్ ఇమేజ్ కు అనుగుణంగా కొన్ని కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. తాజాగా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీ రెడీ అయింది. త్వరలోనే  ఈ మూవీని సెన్సార్‌కు పంపనున్నారు. భీమ్లా నాయక్ ను తెలుగుతో పాటు హిందీలోనూ ఒకేతేదీన విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను హిందీలో B4U మోషన్ పిక్చర్స్ సంస్థ రిలీజ్ చేయనుంది. 

మరిన్ని వార్తల కోసం:

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ బప్పి లహిరి మృతి

ప్రభాస్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్