గర్ల్స్ ను వేధించాడని.. లెక్చరర్ కు దేహశుద్ధి చేసిన స్టూడెంట్స్

గర్ల్స్ ను వేధించాడని.. లెక్చరర్ కు దేహశుద్ధి చేసిన స్టూడెంట్స్
  • దేవరకొండ గర్ల్స్​ కాలేజీలో  లెక్చరర్  వేధింపులు

దేవరకొండ, వెలుగు: నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని గవర్నమెంట్​ గర్ల్స్​ జూనియర్  కాలేజీలో విద్యార్థినులను వేధించిన లెక్చరర్ ను ఏబీవీపీ కార్యకర్తలు, స్టూడెంట్ల తల్లిదండ్రులు చితకబాదారు. కాలేజీ తెలుగు లెక్చరర్​ భాస్కర్  కొంత కాలంగా విద్యార్థినులను వేధిస్తుండగా, విషయం తెలుసుకున్న ఏబీవీపీ కార్యకర్తలు మంగళవారం కాలేజీకి చేరుకొని ఆందోళనకు దిగారు. కాలేజీలో ఉన్న లెక్చరర్​ను చితకబాదారు.

విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన లెక్చరర్ పై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న దేవరకొండ పోలీసులు కాలేజీకి చేరుకొని తెలుగు లెక్చరర్​ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విద్యార్థినులు మాట్లాడుతూ అసభ్య పదజాలం వాడేవాడని, ఈ విషయాన్ని కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.