మంగళవారం పెరిగిన గోల్డ్.. హైదరాబాదులో వెండి రేటు కేజీ ఎంత ఉందంటే?

మంగళవారం పెరిగిన గోల్డ్.. హైదరాబాదులో వెండి రేటు కేజీ ఎంత ఉందంటే?

బంగారం ధరలు రోజురోజుకూ ఊహించని విధంగా పెరిగిపోతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు సంతోషంగా ఉన్నప్పటికీ శుభకార్యాలకు షాపింగ్ చేసేవాళ్లలో మాత్రం ఆందోళన కొనసాగుతోంది. గోల్డ్ రేట్లు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ వెండి మాత్రం స్థిరంగా ముందుకు సాగుతోంది. దీంతో రిటైల్ షాపింగ్ చేయాలనుకుంటున్న వ్యక్తులు ముందుగా తమ నగరాల్లోని రిటైల్ విక్రయ ధరలను పరిశీలించటం చాలా ముఖ్యం. 

ఆగస్టు 18న బంగారం రేట్లు పెరిగాయి. ఆగస్టు 17 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా రూ.23 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 589గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 290గా కొనసాగుతోంది. 

మంగళవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. ఆగస్టు 18, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.2లక్షల 55వేలుగా ఉంది. అంటే గ్రాము దాదాపు రూ.255 దగ్గర అమ్మకాలు జరుగుతున్నాయి.