హైదరాబాద్, వెలుగు : పాథాలజీ సేవలు అందించే హైదరాబాద్ స్టార్టప్ టెనెట్ మెడ్కార్ప్లో టాటా క్యాపిటల్ దాదాపు రూ. 288 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. కంపెనీకి చెందిన ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ ‘టాటా క్యాపిటల్ హెల్త్కేర్ ఫండ్ 3 , స్విట్జర్లాండ్కు చెందిన గ్లోబల్ ఇంపాక్ట్ ఇన్వెస్టర్ ‘బ్లూ ఎర్త్ క్యాపిటల్’తో కలిసి ఈ పెట్టుబడి పెట్టింది.
2018లో శ్రీచరణ్ దేవినేని స్థాపించిన టెనెట్ డయాగ్నోస్టిక్స్, ప్రస్తుతం 14 రాష్ట్రాల్లో 35కి పైగా కేంద్రాలలో 3 వేలకు పైగా సూపర్ స్పెషాలిటీ పరీక్షలను అందిస్తోంది. తాజాగా సేకరించిన నిధులను దేశవ్యాప్తంగా వ్యాపార విస్తరణకు, బీ2బీ నెట్వర్క్ పెంచడానికి వాడతారు.
