బీబీ పాటిల్కు జహీరాబాద్ టికెట్ ఇవ్వొద్దు.. బీజేపీ స్టేట్ ఆఫీసులో నిరసన

బీబీ పాటిల్కు జహీరాబాద్ టికెట్ ఇవ్వొద్దు.. బీజేపీ స్టేట్ ఆఫీసులో  నిరసన

జహీరాబాద్ ఎంపీ టికెట్ బీబీ పాటిల్ కు ఇవ్వొద్దంటూ స్థానిక నేతలు  బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ముందు నిరసన తెలిపారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో ప్రెస్ మీట్ తర్వాత బయటికి వెళ్తున్న కిషన్ రెడ్డి ముందు ప్లే కార్డులు  ప్రదర్శించారు జహిరాబాద్ కార్యకర్తలు. బీబీ పాటీల్  కు జహీరాబాద్ టికెట్ ఇవ్వద్దంటూ నినాదాలు చేశారు. బీబీ పాటిల్ బీజేపీలో చేరడంతో ఆయనకు నిజామాబాద్ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని  హైదరాబాద్ పార్టీ ఆఫీస్ కు చేరుకుని నిరసన తెలిపారు. జహీరాబాద్ ఎంపీ టికెట్ జైపాల్ రెడ్డికే  ఇవ్వాలని డిమాండ్ చేస్తూ  బీజేపీ స్టేట్ ఆఫీస్ లో నిరసన తెలిపారు.

శుక్రవారం (మార్చి 1,2024) జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ ..పార్టీ కండువా కప్పి బీబీ పాటిల్ ను బీజేపీలోకి ఆహ్వానించారు.   లోక్ సభ ఎన్నికల సమయంలో నేతలంతా బీజేపీలోకి క్యూ కడుతారు.. త్వరలో బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుందన్నారు తరుణ్ చుగ్. బీజేపీ విధానాలకు ఆకర్షితులై సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేసి  బీజేపీలో చేరారని చెప్పారు.