బీఆర్ఎస్​కు జడ్పీటీసీ రాజీనామా

బీఆర్ఎస్​కు జడ్పీటీసీ రాజీనామా
  • జానారెడ్డి సమక్షంలో  కాంగ్రెస్ లో చేరిక     

కొండమల్లేపల్లి.వెలుగు.  బీఆర్ఎస్  సీనియర్ లీడర్​, కొండమల్లేపల్లి  జడ్పీటీసీ  పసునూరి సరస్వతి  సుమారు వందమంది అనుచరులతో  కాంగ్రెస్​లో చేరారు. దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ఆధ్వర్యంలో  మాజీ మంత్రి  కుందూరు జానారెడ్డి సమక్షంలో హైదరాబాద్​లో  వారు కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు.  ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ, పేదల   సంక్షేమం కోసమే  కాంగ్రెస్ కృషి చేస్తోందని అన్నారు. 

పేదల బతుకులను మార్చేందుకు  ముఖ్యమంత్రి, మంత్రులు కష్టపడుతున్నారన్నారు.  కార్యకర్తలు గట్టిగా పని చేసి పార్లమెంట్ఎన్నికల్లో  కుందూరు రఘువీర్ రెడ్డిని భారీ   మెజారిటీతో గెలిపించాలని  అన్నారు.   కాంగ్రెస్​తోనే  అభివృద్ధిసాధ్యమని,  మండల అభివృద్ధి కోసమే కాంగ్రెస్​లో చేరినట్టు సరస్వతి అన్నారు.  దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, నల్గొండ ఎంపీ   అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి,  డీసీసీ  అధ్యక్షుడు శంకర్ నాయక్,  పార్టీ నాయకులు  పాల్గొన్నారు.