మెదక్. వెలుగు: మెదక్ గవర్నమెంట్జనరల్హాస్పిటల్(జీజీహెచ్)కు రూ.3,17,80,979 మంజూరయ్యాయి. హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ ద్వారా ఈ నిధులు కేటాయిస్తూ ప్రిన్సిపల్సెక్రటరీ డాక్టర్క్రిస్టినా జెడ్ చోంగ్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధుల్లో సర్జికల్ఎక్విప్మెంట్కోసం రూ.1,61,25,000, బ్లడ్ కంపోనెంట్సెపరేటర్కోసం రూ.63 లక్షలు, ఎన్ఎంసీ ఎక్విప్మెంట్ కోసం రూ.82 లక్షలు, సర్జికల్ఇంప్లాంట్స్కోసం రూ.11,55,979 కేటాయించారు.
అలాగే నర్సాపూర్ ఏరియా హాస్పిటల్కు రూ.19,15,850 మంజూరయ్యాయి. 500 ఎంఏ ఎక్స్రే మిషన్, ఈసీజీ మిషన్, షాడోలెస్సీలింగ్ల్యాంప్, సెక్షన్ఆపరేటస్ కోసం ఈ నిధులు కేటాయించారు. మెదక్ జీజీహెచ్కు పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయించినందుకుగానూ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావుకు మున్సిపల్ చైర్పర్సన్ రాధికారాజ్కతజ్ఞతలు తెలిపారు.

