దారుణం... మతిస్థిమితం లేని 8 ఏళ్ల బాలికపై 75 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నం

దారుణం...   మతిస్థిమితం లేని 8 ఏళ్ల బాలికపై 75 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నం

పెద్దపెల్లి జిల్లాలో దారుణం జరిగింది. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కూనారం గ్రామంలో మతిస్థిమితం లేని 8 ఏళ్ల బాలికపై 75 సంవత్సరాల వృద్ధుడు బాలికపై అత్యాచారయత్నం చేశాడు. జూలై 2 2024  నాడు సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన జరిగింది. 

ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లి నిందితుడిని అధులోకి తీసుకున్నారు.  వైద్యపరిక్షల నిమిత్తం బాలికను ఆసుపత్రికి తరలించారు. దారుణానికి వడిగట్టిన వృద్ధుడిని కఠినంగా శిక్షించాలని బాలిక కుటుంబ సభ్యులు కోరుతున్నారు. 

పది రోజుల వ్యవధిలోనే పెద్దపల్లి జిల్లా బాలికలపై అత్యాచారం జరగడం ఇది మూడొవది. ఈ ఘటనలపై స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.