
బషీర్బాగ్, వెలుగు: ఇండియన్ పీపుల్స్ థియేటర్స్ అసోసియేషన్(ఇప్టా) 82వ ఆవిర్భావ వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. హిమాయత్ నగర్ ఏఐటీయూసీ భవన్ ఎదుట సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు కుందిమళ్ల ప్రతాప్ రెడ్డి, కార్యదర్శి పల్లె నర్సింహ జెండా ఎగురవేశారు. దర్శక, నిర్మాత మాదాల రంగారావు జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు.
ఇప్టా దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పాటలతో ప్రజలను చైతన్యపరిచిందని తెలిపారు. అదే స్ఫూర్తితో నేడు ప్రజల పక్షాన పని చేస్తోందని పేర్కొన్నారు. పలువురు కళాకారులు పాల్గొన్నారు.