
జమ్మూ వేదికగా ప్రారంభించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
శ్రీనగర్: దేశ సరిహద్దు ప్రాంతాల్లో రూ. 2,941 కోట్లతో నిర్మించిన 90 కొత్త డెవలప్ మెంట్ ప్రాజెక్టులను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. మంగళవారం ఆయన జమ్మూ కాశ్మీర్లోని సాంబా జిల్లాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ బిష్నా,-- కౌల్పూర్, -ఫుల్పూర్ రోడ్డుపై 422.9 మీటర్ల పొడవుతో నిర్మించిన కొత్త దేవక్ బ్రిడ్జితో పాటు మరో 89 ప్రాజెక్టులను రక్షణ మంత్రి ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. ఈ 89 ప్రాజెక్టుల్లో 36 అరుణాచల్ ప్రదేశ్లోనే ఉండగా.. 25 లడఖ్లో, 11 జమ్మూ కాశ్మీర్లో, 5 మిజోరాంలో 3
హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాయి.