పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లిలోని మండల అగ్రికల్చర్ ఆఫీసర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. మూడు గంటల వరకు జరిగిన ఈ తనిఖీలో పలు విషయాలు తమ దృష్టికి వచ్చినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. విత్తనాలు, యూరియా అక్రమంగా నిల్వ ఉంచిన 8 షాపులను గుర్తించినా వాటిపై ఎలాంటి కేసులు పెట్టకపోవడంతోపాటు స్టాక్ రిజిస్టర్స్ అప్డేట్చేయకుండా నిర్లక్ష్యం వహించినట్లు గుర్తుచేశారు.
35 రైతు బీమా అప్లికేషన్లలో 30 మాత్రమే అప్రూవ్ చేయగా.. మిగిలినవి పెండింగ్లో ఉన్నాయి. రైతు భరోసాకు సంబంధించిన పూర్తి డాటా ఆఫీసులో పొందుపరచనట్లు అధికారులు గుర్తించారు. తనిఖీల్లో కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ విజయ్కుమార్, ఇన్స్పెక్టర్ తిరుపతి, పాల్గొన్నారు.
