భర్తకు, అతని ప్రియురాలికి అరగుండు కొట్టించి.. ఊరేగించిన భార్య

భర్తకు, అతని ప్రియురాలికి అరగుండు కొట్టించి.. ఊరేగించిన భార్య

భర్త.. వేరొక మహిళతో సంబంధం పెట్టుకున్నాడన్న ఆరోపణలతో అతనికి, ఆమెకు అరగుండు కొట్టించి ఊరంతా ఊరేగించింది. ఇదంతా ఆమె ఒక్కత్తే చేయలేదు.. అందుకు ఆమె కుటుంబసభ్యులు సైతం సహకరించారు. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగింది.

భర్త మరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకున్న ఓ భార్య.. తన తీరు మార్చుకోవాలని అతని పలు మార్లు సూచించింది. అయినా అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడంతో.. ఆ మహిళతో సన్నిహితంగా ఉన్న టైంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని.. తన కుటుంబసభ్యుల సహకారంతో వారిద్దరికీ అరగుండు కొట్టించింది. అనంతరం వారిద్దరినీ గ్రామంలో ఊరేగించారు కూడా. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆమె కుటుంబసభ్యులు సోషల్ మీడియాల్లో పోస్టు చేయడంతో ఈ ఘటన వెలుగులో వచ్చింది.

హుస్సేన్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అతడి భార్య వారిద్దరినీ పట్టుకొని, ఊరేగించిందని తెలిపారు. అతను మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అతడి భార్య వారిద్దరినీ పట్టుకొని, ఊరేగించిందని హిందూపురం సబ్ డివిజనల్ పోలీసు అధికారి పి.కంజాక్షన్ తెలిపారు. ఈ చర్యకు పాల్పడిన నిందితురాలు, ఆమె కుటుంబ సభ్యులపై 506, 355, 323 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు.