Air India: విమానం నాలుగు గంటలు ఆలస్యం.. సిబ్బందితో ప్రయాణికుల వాగ్వాదం

Air India: విమానం నాలుగు గంటలు ఆలస్యం.. సిబ్బందితో ప్రయాణికుల వాగ్వాదం

ఎయిరిండియా మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే ఎయిరిండియా విమాన ప్రయాణికులు, ఎయిర్ లైన్ సిబ్బంది మధ్య మంగళవారం అర్థరాత్రి ఈ వివాదం చోటు చేసుకుంది. విమానం నాలుగు గంటలు ఆలస్యంగా రావడంతో టెర్మినల్ 3 వద్ద సిబ్బందితో ప్రయాణికులంతా తీవ్ర వాగ్వాదానికి దిగారు. 

ప్రయాణికుడు తెలిపిన వివరాల ప్రకారం ఎఐ-805 విమానం రాత్రి 8గంటలకు రావాల్సి ఉండగా  రాత్రి 11:35 గంటలకు ఆలస్యంగా  వచ్చింది. తర్వాత నాలుగు గంటలు ఆలస్యంగా టెర్మినల్ 3 నుంచి 1:48 గంటలకు బయలుదేరిందని వివరించారు. విమాన సిబ్బందిలో ఏ ఒక్కరు కూడా దీనికి సరైన సమాధానం ఇవ్వలేదని ప్రయాణికులు మండిపడ్డాడు.  స్పష్టత ఇవ్వకుండా ఫైలట్ అస్వస్థకు గురయ్యాడని, క్ర్యూ ఇంకా రాలేదని అబద్దాలు చెప్పారని ప్రయాణికులు పేర్కొన్నారు.