TMU ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ రెడ్డి రాజీనామా

TMU ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ రెడ్డి రాజీనామా
  • కొత్త ప్రధాన కార్యదర్శిగా ఏఆర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి తన జనరల్ సెక్రటరీ పదవికి రిజైన్ చేశారు. గురువారం హైదరాబాద్లో జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో రాజీనామా పత్రాన్ని అందజేశారు. దీన్ని యూనియన్ కేంద్ర కమిటీ ఆమోదించింది. యూనియన్లో ఇప్పటివరకు వివిధ హోదాల్లో ఉన్న సభ్యులు అదే స్థానంలో కొనసాగుతారని టీఎంయూ ప్రెసిడెంట్ తిరుపతి చెప్పారు. కొత్త ప్రధాన కార్యదర్శిగా ఏఆర్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈయన ప్రస్తుతం టీఎంయూ ఆదిలాబాద్ జిల్లా సెక్రటరీగా పనిచేస్తున్నారు.  
అప్పుడే తప్పుకొంటానన్న: అశ్వత్థామ రెడ్డి
‘1,200 మంది సభతో మొదలైన యూనియన్ 35,000 సభ్యులకు పైగా సభ్యత్వాన్ని కలిగి దేశంలోనే పటిష్టమైనదిగా ఎదిగింది. కార్మిక హక్కుల సాధనకు అడ్డుగా ఉన్నానని ప్రభుత్వం భావిస్తే పదవి నుంచి తప్పుకొంటానని గతంలోనే ప్ర కటించిన.. ఆర్టీసీ వారికి పీఆర్సీని ఇంకా ప్రకటించకపోవడం బాధాకరం’ అని అన్నారు.