
బాల్కొండ, వెలుగు: నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు స్కూళ్లలో పాఠ్య పుస్తకాలు అమ్మితే చర్యలు తప్పవని ఎంఈవో రాజేశ్వర్ హెచ్చరించారు. మండల కేంద్రంలోని కృష్ణ వేణి స్కూల్ యాజమాన్యం అధిక ధరలకు పుస్తకాలు అమ్ముతున్నారన్న ఫిర్యాదుతో షాప్ ను తనిఖీ చేశారు. డీఈవో దృష్టికి తీసుకెళ్లి సీజ్ చేస్తామని తెలిపారు. పుస్తకాలు అమ్మితే లైసెన్స్ తప్పనిసరి తీసుకోవాలని సూచించారు.