అక్రమంగా తరలిస్తున్న  పశువుల పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న  పశువుల పట్టివేత

భద్రాచలం, వెలుగు: అక్రమంగా తరలిస్తున్న పశువులను భద్రాచలం పోలీసులు బుధవారం పట్టుకున్నారు. చత్తీస్​గఢ్, ఆంధ్రా బార్డర్​లో పశువులను కొనుగోలు చేసి, కంటైనర్​లో గుట్టుచప్పుడు హైదరాబాద్​లోని కబేళాలకు తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు.

కంటైనర్​లో 80కి పైగా జీవాలను కుక్కారని, వాహనాన్ని భద్రాచలం టౌన్​ పోలీస్​స్టేషన్​కు తరలించినట్లు పేర్కొన్నారు. పశువుల కాళ్లు, కొమ్ములు విరిగాయని చెప్పారు. జీవాలను పాల్వంచలోని గోశాలకు పంపించినట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.