భద్రాద్రికొత్తగూడెం/ జనగామ అర్బన్/ ఖమ్మం టౌన్, వెలుగు : గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలించినా, అక్రమంగా నిల్వ ఉంచినా కఠిన చర్యలు తీసుకుంటామని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్, జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హెచ్చరించారు. శనివారం వారు ఆయా కలెక్టరేట్లలో జిల్లా ఆఫీసర్లు, ఎల్పీజీ సేల్స్ ఆఫీసర్లు, డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీల వారితో కలిసి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో కృత్రిమ గ్యాస్ కొరత సృష్టించవద్దని చెప్పారు.
ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్, గురుకులాలకు గ్యాస్ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్లను కమర్షియల్గా ఉపయోగించే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. కాగా, ఖమ్మం సిటీలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో జిల్లా సివిల్ సప్లైస్ ఆఫీసర్ చందన్ కుమార్ పర్యవేక్షణలో తనిఖీలు నిర్వహించి, 20 డొమెస్టిక్ సిలిండర్లను పట్టుకున్నారు.
