తమ పిల్లలను ఇతరులతో పోల్చొద్దు.. ప్రముఖ వక్త భారతీయం సత్యవాణి

తమ పిల్లలను ఇతరులతో పోల్చొద్దు.. ప్రముఖ వక్త భారతీయం సత్యవాణి

బోధన్, వెలుగు : తల్లిదండ్రులు తమ పిల్లలను పక్క పిల్లలతో పోల్చవద్దని, వారికి ఇష్టమైన రంగాల్లో రాణించేలా ప్రోత్సహించాలని ప్రముఖ వక్త భారతీయం సత్యవాణి సూచించారు. శనివారం బోధన్ పట్టణంలోని విజయసాయి స్కూల్ వార్షికోత్సవం, పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతదేశం వేదాలకు, సంస్కృతి, సంప్రదాయాలకు నెలవు అన్నారు.  పిల్లలు బయట జంక్​ఫుడ్స్​తినొద్దని సూచించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో  ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, పీఆర్​వో ఐఆర్ చక్రవర్తి, ప్రైమరీ ఇన్​చార్జి ప్రిన్సిపాల్ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.