బ్రేకింగ్: ‘కాంతార చాప్టర్‌ 1’ షూటింగ్లో మరో ప్రమాదం.. రిషబ్ శెట్టితో పాటు 30 మందితో వెళ్తున్న పడవ బోల్తా

బ్రేకింగ్: ‘కాంతార చాప్టర్‌ 1’ షూటింగ్లో మరో ప్రమాదం.. రిషబ్ శెట్టితో పాటు 30 మందితో వెళ్తున్న పడవ బోల్తా

నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి (Rishab Shetty) తెరకెక్కిస్తున్న కాంతారా 2.. తరుచూ ప్రమాదాలను ఎదుర్కొంటోంది. 2025 మే నెల నుంచి వరుస మరణాలు సంబవిస్తుండటంతో కాంతారా చిత్రబృందం అయోమయంలో ఉంది. ఈ క్రమంలోనే కాంతారా చిత్ర బృందానికి త్రుటిలో ప్రమాదం తప్పింది.

కాంతారా: చాప్టర్ 1 షూటింగ్ సమయంలో, రిషబ్ శెట్టి మరియు 30 మంది సిబ్బందితో ప్రయాణిస్తున్న పడవ.. మణి రిజర్వాయర్‌లో బోల్తా పడింది. మస్తి కట్టే ప్రాంతంలోని మెలినా కొప్ప లోతులేని నీటిలో ఈ సంఘటన జరిగింది. దీనివల్ల పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. ఈ ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు రిషభ్‌ కూడా పడవలోనే ఉన్నారు. ఆ వెంటనే వారందరూ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు.

అయితే, పడవ బోల్తా పడినప్పుడు కొందరు భయాందోళనకు గురయ్యారని, కానీ లోతు తక్కువగా ఉండటం వల్ల అందరూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారని సమాచారం.మూడ్రోజుల కిందే నటుడు-మిమిక్రీ కళాకారుడు కళాభవన్ నిజూ (43) మరణించాడు. అతను మరణించిన మూడ్రోజులకే ఈ సంఘటన జరిగింది. కాంతారా 2 సినిమా షూటింగ్‌లో బెంగళూరులో గుండెపోటుకు గురయ్యారు.

ఈ ఘటనలో కెమెరాతోపాటు పలు సాంకేతిక పరికరాలు నీటి పాలయ్యాయి. మూడ్రోజుల కిందే నటుడు-మిమిక్రీ కళాకారుడు కళాభవన్ నిజూ (43) మరణించాడు. అతను మరణించిన మూడ్రోజులకే ఈ సంఘటన జరిగింది. కాంతారా 2 సినిమా షూటింగ్‌లో బెంగళూరులో గుండెపోటుకు గురయ్యారు. గత నెలలో, ఈ చిత్రానికి సంబంధించిన ముగ్గురు కళాకారులు వేర్వేరు సంఘటనలలో మరణించారు.

‘పంజుర్లి’  హెచ్చరికలు నిజమవుతున్నాయా?

ఈ క్రమంలో కాంతార సినిమాలో పంజుర్లి దేవత హెచ్చరికల గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కొందరు నెటిజన్లు ఆ హెచ్చరికలు నిజమవుతున్నాయని, సినిమా నటులు వరుసగా మరణిస్తున్నారని అంటున్నారు. అయితే, ఇవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమేనని, వాటికి శాస్త్రీయ ఆధారాలు లేవని మరికొందరు వాదిస్తున్నారు.