ప్రతి ఫేజ్ మధ్య వారం గ్యాప్ ఉండేలా షెడ్యూల్ మార్చండి

ప్రతి ఫేజ్ మధ్య వారం గ్యాప్ ఉండేలా షెడ్యూల్ మార్చండి
  • స్థానిక సంస్థల ఎన్నికలపై ఈసీకి బీఆర్ఎస్​ విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి  ఓటర్ల జాబితా తయారీ, ప్రింటింగ్​, తుది ప్రక్రియకు కేటాయించిన సమయం చాలా తక్కువగా ఉందని బీఆర్ఎస్​ నేతలు పేర్కొన్నారు. శనివారం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని మాజీ ఎంపీ వినోద్​ కుమార్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్​ రెడ్డి, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్​, ఎల్. రమణ, పార్టీ జనరల్​ సెక్రటరీ సోమ భరత్​ కలిశారు. రాష్ట్రంలో ప్రస్తుతం భారీ వర్షాలు, వరదల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి సమయంలో సిబ్బంది సమీకరణ లాంటివి అసాధ్యమవుతాయని పేర్కొన్నారు. 

ప్రతి దశ మధ్య కనీసం ఒక వారం విరామం ఉండేలా ఎన్నికల షెడ్యూల్​లో మార్పులు చేయాలని విజ్ఞప్తి చేశారు. 2025 జులై 1 తర్వాత ఓటర్లుగా నమోదు చేసుకున్న కొత్త ఓటర్లను జాబితా నుంచి అన్యాయంగా తొలగించడం మంచిది కాదన్నారు. ఈ అంశాలను ఎన్నికల సంఘంతో పాటు రాష్ట్ర చీఫ్​ ఎలక్టోరల్​ ఆఫీసర్​ (సీఈవో) సుదర్శన్​ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లారు.