ఆగస్టు 4న బుల్లెట్ ట్రైన్ రిలీజ్

ఆగస్టు 4న బుల్లెట్ ట్రైన్ రిలీజ్

హాలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్ తాజా చిత్రం 'బుల్లెట్ ట్రైన్'. ఆగస్టు 4న యూఎస్ కంటే ఒక రోజు ముందుగా భారతదేశంలో విడుదల కానుంది. 'డెడ్‌పూల్ 2' దర్శకుడు డేవిడ్ లీచ్ హెల్మ్ చేసిన ఈ చిత్రం హాలీవుడ్‌లోని అత్యంత ప్రజాదరణ పొందిన పేర్లతో కూడిన సమిష్టి తారాగణాన్ని కలిగి ఉంటుంది. ఈ చిత్రంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు నామినీ జోయి కింగ్‌, చాలాసార్లు ఎమ్మీ అవార్డుకు నామినేట్ అయిన బ్రియాన్ టైరీ హెన్రీ, 'అవెంజర్స్ : ఏజ్ ఆఫ్ అల్ట్రాన్' ఫేమ్ ఆరోన్ టేలర్ జాన్సన్ కూడా నటించనున్నారు. 

కరెన్ ఫుకుహారా, లోగాన్ లెర్మాన్ తదితరులు కూడా ఈ సినిమా తారాగణంలో ఉన్నారు. బ్రాడ్ పిట్ 2019 తర్వాత మొదటిసారిగా ప్రధాన పాత్రలో పెద్ద తెరపైకి తిరిగి వస్తుండగా... నటుడు సాండ్రా బుల్లక్ సైతం ఈ చిత్రంలో కనిపించనున్నారు. నటుడు ఆరోన్ టేలర్ జాన్సన్ మార్వెల్ యొక్క క్రావెన్ ది హంటర్‌గా కనిపించనున్నారు. సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా సంస్థ ‘బుల్లెట్ ట్రైన్’ మూవీని మన దేశంలోని థియేటర్లలో ఇంగ్లిష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ఆగస్టు 4న విడుదల చేయనుంది!!