న్యూఢిల్లీ: తయారీ రంగం మెరుగుపడటంతో గత నెల భారత పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) 5.2 శాతం వృద్ధి సాధించింది. 2025 ఫిబ్రవరిలో ఇది 2.7 శాతంగా ఉంది. ఈ ఏడాది జనవరిలో పారిశ్రామిక వృద్ధిని నేషనల్స్టాటిస్టిక్స్ ఆఫీస్(ఎన్ఎస్ఓ) 5.1 శాతానికి సవరించింది.
తయారీ రంగం ఉత్పత్తి ఆరు శాతం పెరగగా, గనుల తవ్వకం 3.1 శాతం వృద్ధి చెందింది. విద్యుత్ ఉత్పత్తి 2.3 శాతం పెరిగింది. 2026 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి మధ్య ఐఐపీ వృద్ధి 4.1 శాతంగా ఉంది. వాహనాలు, బేసిక్ మెటల్స్, యంత్రాల తయారీ రంగాలు సత్తా చాటాయి.
