ఐపీఓకు ప్రాప్షేర్ సెలెసియా

ఐపీఓకు ప్రాప్షేర్ సెలెసియా

న్యూఢిల్లీ: ప్రాపర్టీ షేర్​ ఇన్వెస్ట్​మెంట్​ ట్రస్ట్​కు చెందిన ప్రాప్​షేర్​ సెలెసియా ఐపీఓ వచ్చే నెల​ 10–16 తేదీల్లో జరుగుతుంది. దీనిద్వారా కంపెనీ రూ.244.65 కోట్లను సమీకరిస్తుంది. ఒక్కో యూనిట్​ ధరను రూ.10 లక్షల నుంచి రూ.10.50 లక్షలుగా నిర్ణయించారు. ఇది దేశంలోనే మొదటి రిజిస్టర్డ్​ ఎస్​ఎం రీట్​గా నిలవనుంది. 

ఈ నిధులతో అహ్మదాబాద్​లోని వీనస్​ స్ట్రాటమ్​ భవనంలో ఏడు అంతస్తులను కొనుగోలు చేస్తారు. కనీస పెట్టుబడి రూ.10 లక్షలు. ఇందులో స్మార్ట్​వర్క్స్​, ఈఎఫ్​సీ లిమిటెడ్​ వంటి సంస్థలు అద్దెకు ఉన్నాయి. యూనిట్లను  బీఎస్​ఈలో లిస్ట్​ చేయనున్నారు.