జీడిమెట్ల, వెలుగు: బాచుపల్లి పల్లి పీఎస్ పరిధిలోని ఓ కాఫీ షాప్ ముసుగులో హుక్కాసెంటర్ నడుపుతున్నారని తెలుసుకుని మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు రైడ్స్ నిర్వహించారు. నిజాంపేట్లోని డీ మార్ట్వద్ద చైతన్య డీఐ కాఫీ షాప్పేరుతో కొంతకాలంగా హుక్కా సెంటర్ రన్ చేస్తున్నాడు.
విశ్వసనీయ సమాచారం మేరకు మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు మంగళవారం రాత్రి దాడులు నిర్వహించారు. రూ.1.09 లక్షల విలువైన 17 హుక్కా పాట్లను స్వాధీనం చేసుకున్నారు. చైతన్యతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
