టాలీవుడ్ గ్రామరస్ నటి నిధి అగర్వాల్ మరోసారి తన స్టన్నింగ్ ఫోటో షూట్ తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. బ్లాక్ కలర్ షీర్ హాల్టర్ నెక్ కార్పెట్ ట్రాపు లేస్, బీడ్ వర్క్ జోడించింది. ఫ్లోయింగ్ స్కర్ట్ ఆమె లుక్ హైఫ్యాషన్ వైబ్ ఇచ్చింది. మెరిసే బ్యాంగిల్స్, పెద్ద హూప్ ఇయర్ రింగ్స్, రింగ్స్ స్టైలింగ్ పూర్తి చేయగా, ఈ బుక్ కాన్ఫిడెన్స్, సెన్సువాలిటీని హైలైట్ చేస్తోంది.
1993 ఆగస్టు 17న హైదరాబాద్ లో జన్మించి, బెంగళూ రులో పెరిగింది నిధి. మిస్ దివా యూనివర్స్ 2014లో పాల్గొంది. 2017లో విడుదలైన 'మున్నా మైఖేల్'లో బాలీవుడ్ లో అరంగేట్రం చేసింది. జీ సినీ అవార్డు ఉత్తమ నూతన నటి పురస్కారం అందుకుంది. 2018లో సవ్యసాచితో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 'ఇస్మార్ట్ శంకర్', 'కలగ తలైవన్' వంటి చిత్రాల్లో నటించింది.
►ALSO READ | మా శరీర భాగాలపై జూమ్ ఏంటి? ఫోటోగ్రాఫర్ల తీరుపై హీరోయిన్ల ఆవేదన..!
గతేడాది పవన్ కల్యాణ్ సరసన 'హరి హర వీర మల్లు'లో పంచమి పాత్రతో నటించి మెప్పించిందీ ముద్దుగుమ్మ. 2026లో విడుదలైన రాజా సాబ్ లో ప్రభాస్ సరసన నటించింది. బేసే పాత్రతో మరోమారు ప్రేక్షకుల మనసుదోచింది. ప్రస్తుతం ప్రస్తుతం ఒక తెలుగు, రెండు హిందీ చిత్రాలతో బిజీగా ఉన్న నిధి, భవిష్యత్తులో రొమాంటిక్, పీరియడ్ లవ్ స్టోరీల్లో నటిస్తానని చెబుతోంది.
