హైదరాబాద్, వెలుగు: “ఆర్టీసీ విలీనంపై గవర్నర్తో మాట్లాడుతా. ఇచ్చిన మాట తప్పను. కార్మికులకు ఉద్యోగ భద్రత ఉంటుంది. విలీనం టైమ్లో గవర్నర్ సిఫార్సులపై చర్చిస్తా ”అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. బుధవారం మెదక్లో సీఎం కేసీఆర్ ను ఆర్టీసీ టీఎంయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏఆర్ రెడ్డి, థామస్ రెడ్డి, యాదయ్య, కమలాకర్ గౌడ్ లు కలిశారు.
ఆర్టీసీ విలీనం ప్రాసెస్ వేగవంతం చేయాలని వినతిపత్రం అందించారు. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్ ఆర్టీసీ విలీనం ప్రాసెస్ స్పీడప్ చేస్తామని, విలీనం టైమ్లో ఏర్పడే సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు లు ఈ మేరకు హామీ ఇచ్చారని థామస్ రెడ్డి ప్రకటనలో తెలిపారు.