రణవీర్ పై మహారాష్ట్ర మహిళా కమిషన్ కు ఫిర్యాదు

రణవీర్ పై మహారాష్ట్ర మహిళా కమిషన్ కు ఫిర్యాదు

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ వివాదం చిక్కుకున్నాడు. ఇటీవల ఓ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ఆయన నగ్నంగా పోటో షూట్ చేశాడు. ఈ ఫొటో షూట్ హాట్ టాపిక్ గా మారింది. దీంతో రణవీర్ ప్రస్తుతం పలు కేసులు ఎదుర్కొంటున్నాడు. ఈ వ్యవహారంపై తాజాగా మరో ఫిర్యాదు నమోదైంది. ఆశిష్ రాయ్ అనే న్యాయవాది రణవీర్ పై మహారాష్ట్ర మహిళా కమిషన్ ముందు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో ప్రాచారమైన రణవీర్ న్యూడ్ ఫోటో షూట్ 'మహిళలు, చిన్న పిల్లల గౌరవానికి' వ్యతిరేకంగా ఉందని ఫిర్యాదు తెలిపారు. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కమీషన్ తరపున నటుడు రణవీర్ సింగ్‌కు నోటీసులు జారీ చేయాలని ఆయన పేర్కొన్నారు. వివాదాస్పద ఈ ఫోటోలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

అయితే గతంలో మహిళలు మాత్రమే ఇలాంటి ఫొటో షూట్లు చేయగా.. భారత్ లో తొలిసారి ఓ పురుషుడు, అది కూడా ఓ స్టార్ హీరో చేసిన ఈ ఫొటో షూట్ చర్చనీయాంశమైంది. రణవీర్ ధైర్యాన్ని అభిమానులు మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం తమ మనోభావాలను దెబ్బతీశాడంటూ అతనిపై విమర్శలు చేస్తున్నారు. రణవీర్ పై అశ్లీలత, అసభ్యతకు సంబంధించి 292, 293, 509 సెక్షన్లతో పాటు ఐటీ చట్టంలోని 67 (A) సెక్షన్ కింద ముంబైకి చెందిన న్యాయవాది వేదిక చౌబే ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.