తెలంగాణలో కొత్తగా 3,527 మందికి కరోనా పాజిటివ్

తెలంగాణలో కొత్తగా 3,527 మందికి కరోనా పాజిటివ్

తెలంగాణలో గత 24 గంటల్లో 97,236 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,527 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా GHMC  ఏరియాలో 519 మంది కరోనా బారినపడ్డారు. నల్గొండ జిల్లాలో 218, ఖమ్మం జిల్లాలో 215, రంగారెడ్డి జిల్లాలో 207 కేసులు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లాలో అత్యల్పంగా 15 కేసులు గుర్తించారు. రికవరీ రేటు 92.81 శాతానికి పెరిగింది. అదే సమయంలో 3,982 మంది కరోనా నుంచి కోలుకోగా.. 19 మంది మృతి చెందారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 5,71,044 పాజిటివ్ కేసులు నమోదు కాగా..5,30,025 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇంకా 37,793 మందికి చికిత్స జరుగుతోంది. కరోనా మృతుల సంఖ్య 3,226కి చేరింది.