పార్లమెంట్ ను కాపాడలేని వారు.. దేశాన్ని కాపాడతారా..? : సీపీఐ నారాయణ

పార్లమెంట్ ను కాపాడలేని వారు.. దేశాన్ని కాపాడతారా..? : సీపీఐ నారాయణ

పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు.  పార్లమెంట్ నే కాపాడలేని అసమర్ధులు భారతదేశాన్ని ఎలా కాపాడతారని ఆయన ప్రశ్నించారు. భారతదేశ చరిత్రలో ఇంత మంది ఎంపీలను సస్పెండ్ చేసిన ఘటన ఎప్పుడూ జరగలేదని బీజేపీ తీరుపై మండిపడ్డారు సీపీఐ నారాయణ . పార్లమెంట్ పై దాడి ఘటనపై చర్చకు పట్టుబట్టడం తప్పా అని ప్రశ్నించారు.  . ఒకవేళ ఏదైనా జరిగితే సభ్యులు చనిపోయేవారు కదా? బీజేపీ ఎంపీ పాస్ ఇవ్వడం నిజమా కాదా? పొరపాటున  MIM ఎంపీ ఇచ్చి ఉంటే ఏం చేసేవారు? ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది అని  అనుమానం వ్యక్తం చేస్తూ ...   ఎన్నికల గిమ్మిక్ లో భాగంగానే ప్రమాదకర గేమ్ ఆడారని సీపీఐ నారాయణ అన్నారు.

 ఇండియా కూటమికి దేశంలో జనాదరణ పెరుగుతుంది కాబట్టి ఇలా చేస్తున్నారన్నారు. రామజన్మభూమి ఆలయానికి వ్యూహాత్మకంగా అందరినీ పిలిచారు. బాబ్రీ మసీదు కూలగొట్టడానికి ఆద్యుడు ఎల్కే అద్వానీ. కానీ ఆయన్ను రానివ్వడం లేదు. ఆయనొస్తే పేరు ఆయనకే వెళ్తుంది. అది మోడీకి ఇష్టం లేదు. అందుకే అద్వానీ, మురళీ మనోహర్ జోషికి ఆహ్వానం లేదు. ఉపరాష్ట్రపతిని మిమిక్రీ చేశామని గోల చేస్తున్నారు. అది ఒక కళ. ఇండియా కూటమి పొత్తులు తెలంగాణలో విజయం సాధించాయి.ఇండియా కూటమికి అనుకూలంగా ఉండేవారితోనే మా పొత్తులు ఉంటాయి

ఏపీలో పార్టీలు అన్నీ కేంద్ర హోంమంత్రిని, బీజేపీని చూసి భయపడుతున్నాయి. మోడీని వ్యతిరేకిస్తే తమకు ఎక్కడ ఇబ్బందులు సృష్టిస్తారో అని వారంతా భయపడుతున్నారు. . బీజేపీ వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు నష్టపోయాయి. ప్రత్యేక హోదా సహా ఏదీ రాలేదు. తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపే. వారితో అంటకాగే పార్టీలకు కూడా ప్రజలు ఓటు వేయరు. టీడీపీని ఇండియా కూటమిలోకి ఆహ్వానిస్తున్నామంటూ... పోల్ మేనేజ్‌మెంట్‌కు భయపడే వారే బీజేపీ‌ పొత్తు కోసం ఆరాటపడుతున్నారని సీపీఐ నేత నారాయణ అన్నారు.