మెదక్, వెలుగు: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళ, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, హెల్త్ డిపార్ట్మెంట్ సహకారంతో మెదక్ పట్టణంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం(ఎం సీహెచ్) వద్ద గురువారం ఊయల ఏర్పాటు చేశారు. ఎవరైనా పిల్లలు వద్దనుకుంటే ముళ్లపొదలు, చెత్త కుప్పల్లో పడేయకుండా ఆ పిల్లలను తీసుకువచ్చి ఊయలలో వదిలి వెళ్లొచ్చని నిర్వాహకులు తెలిపారు.
ఆ పిల్లలను మహిళా శిశు సంక్షేమ శాఖ రక్షణ, సంరక్షణ బాధ్యత తీసుకుంటుందని పేర్కొన్నారు. ఊయలను మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దొంతి నరేశ్గౌడ్, వార్డు కౌన్సిలర్ అనీష్ ఫాతిమా ప్రారంభించారు. ఆసుపత్రి ఆర్ఎంవో డాక్టర్ రేవతి, గైనకాలజీ హెచ్వోడీ డాక్టర్ రాజేశ్వరి పాల్గొన్నారు.
