
డోర్నకల్ (గార్ల), వెలుగు: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని మున్నేరు ప్రతిపాదిత స్థలాన్ని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదివారం పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణ సాధ్యాసాధ్యాలపై ఇరిగేషన్ అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ దుర్గ ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ గార్ల మండలాధ్యక్షుడు ధనియాకుల రామారావు, ఎంపీపీ వెంకట్ లాల్ తదితరులు పాల్గొన్నారు.