
కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా డాక్టర్ అశ్విని తానాజీ వాకడె మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్, ఏవో సుధాకర్, పలువురు జిల్లా అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అడిషనల్ కలెక్టర్కు శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ను మర్యాదపూర్వకంగా కలిశారు.