ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులతో ఆటోను దగ్ధం చేసిన డ్రైవర్

ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులతో ఆటోను దగ్ధం చేసిన డ్రైవర్

హనుమకొండలోని కాళోజీ సెంటర్లో ఒక ఆటో డ్రైవర్ హల్ చల్ సృష్టించాడు. నడిరోడ్డుపై తన ఆటోకు తానే నిప్పుపెట్టుకుని నిరసన వ్యక్తం చేశాడు. ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులే దీనికి కారణమని తెలిపాడు డ్రైవర్ శ్రీనివాస్. 

వాహనాల రద్దీతో ఉన్న నాలుగు రోడ్ల కూడలిలో ఆటోపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టడంతో పెద్ద ఎత్తున ఒక్క సారిగా మంటలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో అలజడి రేగింది. ఏం జరుగుతోందో అర్థం కాక వాహనదారులు ఆందోళన చెందారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. అయితే ఆటో మాత్రం పూర్తిగా కాలిపోయింది. పోలీసులు ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఫైనాన్స్ వేధింపులు తట్టుకోలేకనే ఈ పని చేసినట్లు తెలిపాడు డ్రైవర్ శ్రీనివాస్.