- కీలక రికార్డులు దగ్ధం
- ఘటనపై అనుమనాలు
మల్కాజిగిరి, వెలుగు : కాప్రా సౌత్ కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫీసులో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఫర్నిచర్, ముఖ్యమైన రికార్డులు దగ్ధమయ్యాయి. అయితే, దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మధ్యాహ్నం 12:30 గంటల తర్వాత ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మంటల తీవ్రత వల్ల భవన గోడలకు పగుళ్లు వచ్చాయి.
ఫైర్ఫైటర్స్కు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రూ.8 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. షార్ట్సర్క్యూట్వల్ల ఫైర్యాక్సిడెంట్జరిగిందని చెప్తున్నా తమకు అనుమానంగా ఉందని అసోసియేషన్సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
