V6 News

భారత మాజీ క్రికెటర్ అరెస్ట్

భారత మాజీ క్రికెటర్ అరెస్ట్

మాజీ భారత క్రికెటర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో కారును ఢీకొట్టిన కేసులో భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీని బాంద్రా పోలీసులు అరెస్ట్ చేశారు. తదుపరి విచారణ జరుగుతోందని తెలిపారు. బాంద్రా సొసైటీకి చెందిన ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదుతో కాంబ్లీని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ ఆర్‌డబ్ల్యూ కింద అభియోగాలు నమోదు చేశారు. బాంద్రా సొసైటీ నివాసి ఫిర్యాదు మేరకు వినోద్ కాంబ్లీ (50)ని అరెస్టు చేశారు. అతనిపై ఇండియన్ పీనల్ కోడ్ (IPC) మోటారు వాహన చట్టం 185 సెక్షన్ కింద అభియోగాలు నమోదు చేశారు. అయితే ఆ రోజే కాంబ్లీ బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ ఘటన తర్వాత కాంబ్లీ కాంప్లెక్స్ వాచ్‌మెన్‌తో పాటు అక్కడ ఉన్న కొంతమంది నివాసితులతో కూడా వాదించాడని ఆరోపించారు.

కాంబ్లీ 17 టెస్టులు ఆడారు. 4 సెంచరీలతో సహా 1084 పరుగులు చేశాడు. అతను భారతదేశం తరపున 104 ODIలు ఆడాడు, 2 సెంచరీలతో సహా 2477 పరుగులు చేశాడు. ముంబైకు చెందిన ఈ బ్యాట్స్ మాన్ 1991లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. అక్టోబర్ 2000లో వినోద్ కాంబ్లీ చివరి మ్యాచ్ ఆడాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో కలిసి క్రీడలో మెళుకువల్ని నేర్చుకుంటూ కాంబ్లీ ప్రతిభావంతుడైన క్రికెటర్‌గా ఎదిగాడు. అయితే ఆ తర్వాత  తన ప్రవర్తనపై వివాదాలతో కూరుకుపోయాడు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ మాజీ క్రికెటర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పనిచేయడానికి కూడా ఇంట్రస్ట్ చూపించాడు. 

గత ఏడాది డిసెంబర్‌లో కాంబ్లీ సైబర్ మోసానికి గురైన విషయం తెలిసిందే. ఒక ప్రైవేట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్‌గా అజ్ఞాత వ్యక్తి చేసిన ఫోన్‌ కాల్ నో యువర్ కస్టమర్ (KYC) వివరాలను అడిగి తెలుసుకున్నాడు. కెవైసీ అప్‌డేట్ చేస్తాననే సాకుతో అతని ఖాతా నుండి రూ. 1.14 లక్షలు విత్‌డ్రా చేశాడు. 

ఇవి కూడా చదవండి:

మనసు మార్చుకున్న ఉక్రెయిన్ ప్రెసిడెంట్

ప్రధాని మోడీ హైలెవల్ మీటింగ్