
- సీఎం రేవంత్ను కోరిన విఠల్ రెడ్డి
భైంసా, వెలుగు: ముథోల్ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కోరారు. శనివారం హైదరాబాద్లో సీఎంను కలిసి పలు సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్కు అనువైన స్థలం నియోజకవర్గంలో ఉందని, ఏర్పాటు చేయాలని కోరారు. లోకేశ్వరం అర్లి వంతెన శిథిలావస్థకు చేరుకోవడంతో కొత్త వంతెన మంజూరైందని, ప్రతిపాదనలకు అనుమతివ్వాలన్నారు.
బాసరలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి గతంలో మంజూరైన రూ. 42 కోట్ల మాస్టర్ప్లాన్ పనులకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో చాలా చెరువులు దెబ్బతిన్నాయని, రిపేర్ల కోసం అధికారులు ప్రతిపాదనలు పంపారని, నిధులు విడుదల చేయాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని సీఎంను కోరినట్లు
విఠల్రెడ్డి తెలిపారు.