ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయండి : విఠల్ రెడ్డి

ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయండి :  విఠల్ రెడ్డి
  • సీఎం రేవంత్​ను​ కోరిన విఠల్​ రెడ్డి

భైంసా, వెలుగు: ముథోల్​ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్​ స్కూల్​ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్​ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే విఠల్ ​రెడ్డి కోరారు. శనివారం హైదరాబాద్​లో సీఎంను కలిసి పలు సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. ఇంటిగ్రేటెడ్ ​స్కూల్​కు అనువైన స్థలం నియోజకవర్గంలో ఉందని, ఏర్పాటు చేయాలని కోరారు. లోకేశ్వరం అర్లి వంతెన శిథిలావస్థకు చేరుకోవడంతో కొత్త వంతెన మంజూరైందని, ప్రతిపాదనలకు అనుమతివ్వాలన్నారు. 

బాసరలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి గతంలో మంజూరైన రూ. 42 కోట్ల మాస్టర్​ప్లాన్​ పనులకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో చాలా చెరువులు దెబ్బతిన్నాయని, రిపేర్ల కోసం అధికారులు ప్రతిపాదనలు పంపారని, నిధులు విడుదల చేయాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని సీఎంను కోరినట్లు 
విఠల్​రెడ్డి తెలిపారు.