వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచే నా అనుచరుల పోటీ : బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచే నా అనుచరుల పోటీ : బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
  • గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

గద్వాల, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో తన అనుచరులు కాంగ్రెస్  నుంచి పోటీ చేస్తారని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. బుధవారం రాత్రి పట్టణంలో గద్వాల నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథ్, సంపత్ కుమార్, క్రిస్టియన్  ఫైనాన్స్  కార్పొరేషన్  చైర్మన్  దీపక్ జాన్, పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, వెంకటేశ్​ హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలే తన బలమని, కార్యకర్తలే బలగమని చెప్పారు. గద్వాల నియోజకవర్గం అభివృద్ధి కోసమే ప్రభుత్వంతో కలిశానని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్  పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తుందన్నారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అందరూ కష్టపడి పని చేయాలని పార్టీ నేతలు సూచించారు.