
పద్మారావునగర్/ముషీరాబాద్, వెలుగు: ఆషాఢం బోనాల ఉత్సవాలు నగరంలో కంటిన్యూ అవుతున్నాయి. శుక్రవారం సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ, ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని లేబర్ కమిషనర్ కార్యాలయంలో ఉత్సవాలు జరుపుకున్నారు. అమ్మవార్లకు బోనాలు చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమాల్లో గాంధీ మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రవి శేఖర్రావ్, ప్రొఫెసర్లు కృపాల్ సింగ్, రమాదేవి, పూర్ణయ్య, చంద్రశేఖర్, ఏడీ జగదీశ్వర్, అడిషనల్ లేబర్ కమిషనర్ గంగాధర్, శ్యాంసుందర్ రెడ్డి, సునీత, చంద్రశేఖర్ పాల్గొన్నారు.