
హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలోని 74 ప్రైవేట్, ప్రభుత్వ హాస్పిటళ్లోని క్యాంటీన్లలో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు పాటించని 14 క్యాంటీన్లకు నోటీసులిచ్చారు. అలాగే ఫుడ్ శాంపిల్స్ సేకరించి, టెస్టుల కోసం ల్యాబ్ కు పంపారు.
కొన్ని క్యాంటీన్లలోని కిచెన్లు అపరిశుభ్రంగా ఉండగా, ఇంకొన్నింట్లో ఆహార పదార్థాలకు లేబుల్స్, ఎక్స్పైరీ డేట్స్లేవని గుర్తించారు. వాషింగ్ ఏరియా సరిగా లేదని, రిఫ్రిజిరేటర్లోని ఆహార పదార్థాలను లేబుల్ చేయకుండా ఉంచడం, కొన్నింటిని నేలపై నిల్వ చేయడం, చెత్తబుట్టలను ఓపెన్ గా ఉంచినట్లు తెలిపారు.