
ట్యాంక్ బండ్, వెలుగు: చిక్కడపల్లి లోని సిటీ లైబ్రరీలో అంధుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జ్ఞానజ్యోతి విభాగాన్ని గ్రంథాలయ చైర్మన్ రియాజ్, అడిషనల్ కలెక్టర్ కదిరావన్ గురువారం ప్రారంభించారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అంధ విద్యార్థులు సాఫ్ట్వేర్ సాయంతో కంప్యూటర్ ను యాక్సెస్ చేసుకునే వెసులుబాటు కల్పించామన్నారు.