నీటిలోనే లింగంపల్లి రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి..ప్రజల అవస్థలు

 నీటిలోనే లింగంపల్లి రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి..ప్రజల అవస్థలు

హైదరాబాద్లోని లింగంపల్లి రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి నీటిలో చిక్కుకుపోయింది. భారీ వర్షానికి రైల్వే అండర్ పాస్లో వరద నీరు భారీగా చేరింది. అక్కడ చిన్నపాటి చెరువును తలపిస్తోంది. వరద నీటికి తోడు..డ్రైనేజీ వాటర్ తో అండర్ పాస్ బ్రిడ్జి మొత్తం జలమయం అయింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు రాకపోకలు నిలిపివేశారు. 

లింగంపల్లి రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి నీటిలో చిక్కుకుపోవడంతో వాహనదారులు, చుట్టు ప్రక్కల కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు నుంచి ఇటు రావాలన్నా..ఇటు నుంచి అటు వెళ్లాలన్నా..నరకం అనుభవిస్తున్నారు. కొందరైతే ప్రాణాలను ఫణంగా పెట్టి..రైల్వే పట్టాలను దాటుతున్నారు.