గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై పీడీయాక్ట్కు సంబంధించి దాఖలైన పిటిషన్పై విచారణను వాయిదా పడింది. ఈ కేసు తదుపరి విచారణ సోమవారం మధ్యాహ్నం 2.30గంటలకు చేపడతామని ప్రకటించింది. తన భర్తపై అక్రమంగా పీడీ యాక్ట్ పెట్టారంటూ రాజాసింగ్ భార్య హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానంలో కౌంటర్ సమర్పించింది. దాన్ని పరిశీలించిన న్యాయమూర్తి కేసును సోమవారానికి వాయిదా వేశారు.
ఇదిలా ఉంటే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై ప్రివెంటీవ్ డిటెన్షన్ యాక్ట్ అమలుకు అడ్వయిజరీ బోర్డ్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. పోలీసులు పెట్టిన పీడీ యాక్ట్ను సమర్థిస్తూ తీర్పు వెల్లడించింది. పీడీ యాక్ట్ను ఎత్తివేయాలని రాజాసింగ్ భార్య ఉషాబాయీ వేసిన రివోక్ పిటిషన్ను రిజెక్ట్ చేసింది. పోలీసులు అందించిన సాక్ష్యాధారాలను సమగ్రంగా పరిశీలించింది. సుప్రీంకోర్ట్ ప్రొసీజర్ ప్రకారమే చర్యలు తీసుకున్నారని గుర్తించింది. చర్లపల్లి సెంట్రల్ జైలులో ఉన్న రాజాసింగ్పై నిబంధనల ప్రకారం ఏడాది కాలం పీడీ అమలు చేయాలని ఆదేశించింది. బోర్డ్ ఇచ్చిన తీర్పుపై రాజాసింగ్తరుఫు న్యాయవాది కరుణసాగర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. బోర్డ్ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్తామన్నారు. పీడీ యాక్ట్ను సవాల్ చేస్తూ ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేశామన్నారు. బోర్డు తీర్పుపై కూడా అప్పీల్కు వెళ్తామని చెప్పారు.