
ఛటోగ్రామ్ వేదికగా ఇండియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతోన్న ఫస్ట్ టెస్ట్ మ్యా్చ్ లో బంగ్లాకు టీమిండియా 513 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాను 150 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో రెండు వికెట్లను కోల్పోయి 258 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది. ఓపెనర్ శుభ్మన్ గిల్ (110), ఛెతేశ్వర్ పుజారా (102) సెంచరీలు చేశారు. గిల్ కి ఇది టెస్టులో తొలి సెంచరీ కాగా దాదాపు నాలుగేళ్ల తర్వాత పుజారా సెంచరీ బాదాడు.
టెస్టు మ్యాచ్ లో పుజారాకి ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. తొలి ఇన్నింగ్స్ లో 90 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఇక కేఎల్ రాహుల్ 23, కోహ్లీ 19 పరుగులు చేశారు. కాగా తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 404 పరుగులకు ఆలౌట్అయింది.