
జనగామ అర్బన్, వెలుగు : బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కలెక్టరేట్లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు జిల్లా కార్మిక సంక్షేమ శాఖ, జిల్లా సంక్షేమ శాఖలు సంయుక్త ఆధ్వర్యంలో పోస్టర్ను ఆవిష్కరించారు. బాల్యాన్ని పరిరక్షించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలని, సంబంధిత శాఖలు, యంత్రాంగాలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో భాగంగా బాల కార్మికులపై అవగాహనకు ర్యాలీలు చేపట్టాలని, బాల కార్మికుల గుర్తింపు కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలో దయానిలయం వద్ద నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్వెజ్, నాన్వెజ్ మార్కెట్ పనులను కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ పింకేశ్కుమార్తో కలిసి పరిశీలించారు. పనులు నెలలోగా పూర్తి చేయాలని ఆదేశించారు.